సహజ వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ దేశంలో ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోన్న సుభాష్ పాలేకర్ గురించి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సుపరిచితమే. ఆయన అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఆచరించేందుకు మన రాష్ట్రానికి చెందిన కొందరు పాలేకర్ ను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి రైతులకు రెండేళ్లుగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 22 వ తేదీ వరకు తిరుపతిలో జీరో బడ్జెట్ వ్యవసాయం పై ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతి సదస్సు గురించి 09849059573 ఈ నెంబరులో సంప్రదించవచ్చు.
అలానే ఏప్రిల్ 1 నుంచి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో సైతం ఇటువంటి సదస్సు జరగనుంది. హైదరాబాద్ లకడికపూల్ లో ఉన్న మారుతి గార్డెన్స్ లో జరగనున్న ఈ సమావేశానికి ఆసక్తి ఉన్న రైతులు హాజరు కావచ్చు. పర్యావరణ ఉద్యమకారుడు "సేవ్" సంస్థ నిర్వాహకుడు అయిన విజయరాం హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040 - 27654336 నెంబరులో సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment