సేద్యం గిట్టుబాటు కాని నేటి పరిస్థితుల్లో.., వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సేద్యంలో విప్లవాత్మక ఫలితాలను అందుకుంటున్న వారే స్ఫూర్తిగా చిన్న, సన్నకారు రైతులు నేడు వ్యవసాయాన్ని కొ్త్తపుంతలు తొక్కించాలి. సేద్యాన్ని ఒక పరిశ్రమగా, ప్రతి రైతూ గ్రామీణ కొర్పొరేట్గా అవతరించగలగటమే సాగుదార్ల సంక్షోభానికి తీరైన జవాబు. ఈ క్రమంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుల ఆగ్రహం దేశవ్యాప్తమై వారిని దహించివేయడం ఖాయం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Monday 30 April 2018
Thursday 5 April 2018
కరీంనగర్ డెయిరీ విజయబాట
కరీంనగర్ డెయిరీ విజయ ప్రస్థానంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రూపొందించిన డాక్యుమెంటరీ.
సేద్యం కలసిరాకపోయినా పశుపోషణ రైతుల్నిఆదుకుంటోంది అనడానికి ఇదొక నిదర్శనం.
A Silent Revolution
Wednesday 4 April 2018
పేద రైతుబిడ్డలకు ఉచిత వ్యవసాయశిక్షణ
పదో తరగతి వరకు చదివి పై చదువులకు వెళ్లే స్థోమత లేని పేద రైతు కుటుంబాలకు శుభవార్త. వ్యవసాయ రంగంలో ప్రాధమిక స్థాయిలో ఉద్యోగాలు పొందే (సమర్ధత ఉంటే పై స్థాయిలోనూ)లా ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసాయ కోర్సులను పూర్తి ఉచితంగా అందిస్తోంది నర్సాపూర్ (హైదరాబాద్కు 70 కి.మీటర్లు) కు సమీపంలోని "బేయర్-రామానాయుడు విజ్ఞానజ్యోతి విద్యాసంస్ధ". ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 2018 అన్నదాత మాసపత్రిక లో అందించాను. పేద రైతుబిడ్డలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)