Pages

Thursday 3 May 2018

"చింత"కు విలువ జోడిస్తే.. నిశ్చింతే!

ఒక పంట బాగా పండే ప్రాంతాలలో వాటిని ప్రాసెస్‌ చేసే పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి. గిరిజన రైతుల్ని వ్యాపారులు చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు. గిరిజన సహకార సంస్ధ తోడ్పాటు ఉన్నా ప్రభుత్వాలు చొరవ చూపి ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చేయూతనిస్తే చింతచెట్లు పెంచే వారికి ఇక నిశ్చింతే అన్న నా వ్యాసం ఈ నెల అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది. ఇలాంటి యూనిట్లు పెట్టే రైతు సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ఇదెంతో ఉపయోగకరం.