అవసరమైనది
దొరకనప్పుడు అదే మనకు ప్రియం
అవుతుంది. ఇజ్రాయెల్కు
లేనిది నీరు. అదే అక్కడ అపురూపం. అపురూపమైన
నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి
చుక్కనీరు వృథా కాకుండా
సమర్ధంగా వాడుకున్నారు. జాతిగా
తమకున్న అపార మేథోశక్తిని
ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా
సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఆవిష్కరించారు. వాటి
సాయంతో ఊహకందని ఫలితాలను
రాబట్టుకున్నారు. ఏదీ
దొరకని చోట అన్నీ దొరికేలా
చేసుకున్నారు. అన్నీ
ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా
నిలిచారు. నా
ఇజ్రాయెల్ పర్యటనలో చూసిన
అనుభవాలతో రెండు దేశాల మధ్య
ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు
రాజకీయాలు మన రైతులకెంత శాపంగా
పరిణమించాయో నాకు అర్ధమైంది. ఈ
రెండు దేశాలకూ ఉన్న ప్రధాన
వ్యత్యాసం ఇదే. మిగతావన్నీ
దీని తర్వాతే.
భారత్
తో పోల్చితే ఇజ్రాయెల్
వ్యవసాయంలో ఉన్నదీ మనకు
లేనిదీ.,
రెండు
దేశాల మధ్య ఉన్న సారూప్యాలు,
వ్యావసాయకంగా
ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన
వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది.
మీ
కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.