Pages

Tuesday 9 May 2017

రైతులెందుకు దీనావస్ధలో ఉన్నారు?

స్వాతంత్ర్యం వచ్చాక నేటికి మన దేశం అన్ని రంగాలలో ఎంతో పురోగమించిన మాట వాస్తవం. కొనుగోలు శక్తి పరంగా పటిష్టమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగిన తొలి 5 దేశాల్లోనూ మనం చోటు సాధించాం. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సాధిస్తున్న మన మిలియనీర్ల సంఖ్యా ఏటికేడూ అధికమవుతోంది.  వ్యవసాయరంగంలోనూ విప్లవాత్మక మార్పులెన్నో చోటు చేసుకున్నాయి. కానీ ఒక్కటే ప్రశ్న.    రైతులెందుకు దీనావస్ధలో ఉన్నారు.., వారెందుకు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోంది..? మట్టినే నమ్ముకున్నవారిని పట్టిపీడిస్తున్న ఈ ప్రశ్నకు స్వాతంత్ర్యానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జవాబు చెప్పలేకపోవడాన్ని ఏమనాలి? రైతు దీనస్థితికి దారితీస్తున్న పరిస్థితుల్ని విశ్లేషించి వాటికి పలు పరిష్కారాలు సూచించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.