Pages

Monday 31 December 2012

నూతన వత్సరంలో కొత్త సంకల్పం

                                                             
ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  నిరుటి ప్రమాణాలను ఎంత వరకు పాటించామో., ఆ లక్ష్యాలను ఎంత వరకు అధిగామించామో నేడు ఒక్కసారి తరచి చూసుకోవాలి. ఆ లోటుపాట్లను సమీక్షించుకుని కొత్త గమ్యాన్ని నిర్దేశించుకుందాం. జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూనే వాస్తవంలో నెరవేర్చాల్సిన కర్తవ్యానికి వెన్నంటే ఉందాం. ఒక ఆశావహ భవిష్యత్తు దిశగా జీవితాన్ని నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనకు అనంతమైన శక్తి యుక్తులు ఇవ్వాలని  ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటూ అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Friday 28 December 2012

2012లో వ్యవసాయకంగా అడుగు వెనక్కే!


వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు వదల్లేదు. వరుస విపత్తులు  రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.  పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                               

Wednesday 26 December 2012

తెలుగింటి పండగ

                                                                
అజంత భాషయిన తెలుగు మాధుర్యాన్ని దేశ దేశాల్లోని తెలుగు వారందరికీ చేరువ చేయడం లక్ష్యంగా నేడు ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలు 226 విభిన్న కార్యక్రమాలతో తల్లిభాషకు శోభను చేకూర్చబోతున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం, వికాసానికి కృషి చేయడం, శాస్రీయ జానపద కళారూపాలను ప్రోత్సహించడం, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, మాదలిక పదకోశాల రూపకల్పన తదితర 9 ప్రధాన ఆశయాలతో ఈ సభలు జరగనుండటం విశేషం.
అయితే.., పరాయి భాషా వ్యామోహంలో అమ్మ భాష అంతరించిపోయే దుస్థితిని కొని తెచ్చుకొంటున్నాం. సోదర తమిళులు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానంలో మనకు ఒక వంతు కూడా లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. చట్టబద్దంగా తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను దాని పర్యవేక్షణ కిందకు తీసుకురావాలన్న భాషోద్యమకారుల కోరికను తీర్చే దిశగా మనం ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరముంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను ఆధునికీకరించడం నేడెంతో అవసరం. భోధనా భాష కాకుండా అమ్మభాష బతకజాలదని నేడందరూ గుర్తించి పాలకులతో సహా అందరూ గుర్తించి ఆచరించాల్సిన తరుణమిది.  తెలుగు భాష వికాసం లక్ష్యంగా ఇది మన తెలుగు వారందరి గురుత బాధ్యత. మన కర్తవ్యం కూడా..!

Wednesday 19 December 2012

పత్తి రైతు దూదిపింజే!


నెట్ కు దూరంగా వ్యక్తిగత పని ఒత్తిడిలో ఉండి నిన్న ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసం "మార్కెట్ వలలో విల విల - పత్తి రైతు దూదిపింజే " ను పోస్ట్ చేయలేకపోయాను. రాష్ట్రంలో పత్తి రైతుల మార్కెట్ కష్టాలపై రాసిన ఈ వ్యాసంలో కేంద్ర పత్తి సంస్థ (సిసిఐ) బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టడం జరిగింది. బ్లాగు మిత్రుల కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.