Pages

Monday 25 August 2014

ఈటీవికి "సనాతన హిందూ ధర్మ రక్షక్ పురస్కారం"

                                                                     
సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, దేశ, విదేశాల్లోని అపురూప, పురాతన  దేవాలయాల గురించి కోట్లాది వీక్షకులకు అవగాహన కల్పిస్తున్న ఈటీవి "తీర్ధయాత్ర" కార్యక్రమాన్ని గుర్తించి తగురీతిలో గౌరవించింది అమెరికాకు చెందిన "గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ.  దేవాలయాల పరిరక్షణ గురించి ఈ నెల 22 నుంచి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చిత్ర ప్రదర్శన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి చేతుల మీదుగా నేను "సనాతన హిందూ ధర్మ రక్షక్ పురస్కారం" ను అందుకున్నాను. ఈ పురస్కారాన్ని అందించి గౌరవించిన ఫౌండేషన్ చైర్మన్ వెలగపూడి ప్రకాశరావు గారు, "గజల్ మ్యాస్ట్రో" ఆత్మీయ మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఈనాడు హైదరాబాద్ మినీ ఎడిషన్ లో వచ్చిన కవరేజీ క్లిప్పింగ్ ఇది. 
                                                                                  
                                                                    

Saturday 9 August 2014

నాలుగు దశాభ్దాల "ఈనాడు"

రేపు ఆగస్టు 10 కి సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఈ రోజునే తెలుగు పత్రికా ప్రపంచాన "ఈనాడు" అక్షర దీపార్చన ఆరంభించింది. కేవలం 4500 కాపీలతో మొదలెట్టి అగ్రశ్రేణి  తెలుగు దినపత్రిక గా అప్రతీహతంగా ముందుకు సాగుతోంది. పత్రికా రంగంలో ప్రయోగాలకు పుట్టినిల్లుగా నిలిచి., ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టిన పత్రికగా "ఈనాడు" తెలుగు వారి గుండెలలో కొలువుదీరింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వార్తా ప్రమాణాలకు సరికొత్త భాష్యం చెప్పింది. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపకుండా సవాళ్ళను స్వీకరించి దృడంగా నిలిచింది.
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిన ప్రతిసారీ బాధ్యతను గుర్తెరిగి నిరంకుసాధికారానికి ఎదురొడ్డి పోరాడింది. విశ్వసనీయత, నైతిక విలువలే గీటురాళ్ళుగా పవిత్ర విలువల పరిరక్షణ కోసం సొంత వ్యక్తిత్వాన్ని "ఈనాడు" ఏనాడూ వదిలి పెట్టలేదు. ప్రజల పక్షాన ఉద్యమ శంఖాలను పూరించడంలో., విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతను స్వీకరించడంలోనూ "ఈనాడు" ది ఎప్పుడూ ముందుండే తత్వమే.

కోట్లాది ప్రజల ఆశీస్సులతో తెలుగువారి ఇంటింటి నేస్తం గా "ఈనాడు" ఇప్పటికీ మరెప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. ఈనాడు తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈనాడు  మిత్రులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. "నాలుగు దశాభ్దాల ఈనాడు" పై ఈ రోజు రాత్రి  9 గంటలకు., తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ఈటీవి ఆంధ్రప్రదేశ్, ఈటీవి తెలంగాణ చానళ్లు  ప్రత్యేక చర్చను ప్రసారం చేస్తున్నాయి.  లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు డా. జయప్రకాశ్ నారాయణ, ప్రముఖ తెలుగు దిన పత్రికలకు సంపాదకులుగా పని చేసిన సీనియర్ పాత్రికేయులైన ఇనగంటి వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి , పొలిటికల్ ఎనలిస్ట్ సి. నరసింహారావు లు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న పాత్రికేయ మిత్రులు తప్పక చూడాల్సిన చర్చ ఇది.
                                                                       

Wednesday 6 August 2014

నా పాట "సాయినాధ" కు దృశ్య రూపం

గతంలో నేను రచించి విడుదల చేసిన "సాయి స్వరార్చన"  ఆడియో సీడీ లో "సాయినాధా.." అనే పాటకు ఇది దృశ్య రూపం. వీడియో రూపంలో ఈ పాటను మీ కోసం ఇక్కడ యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను. ఈ పాట చిత్రీకరణకు సహకరించిన గాయని గాయత్రి గారికి నా కృతఙ్ఞతలు.
                                                                     
                                                               
                                                                   
                                     https://www.youtube.com/watch?v=bqFjwOzzOis