Pages

Thursday 28 September 2023

రైతు బాంధవుల మృతి తీరని లోటు










రైతు బాంధవుల మృతి తీరని లోటు 

దేశ వ్యవసాయ విప్లవానికి దిశానిర్ధేశం చేసిన భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ గారి మృతి దేశ రైతాంగానికి తీరని లోటు. అత్యున్నత వ్యవసాయ పరిశోధనలను గ్రామీణ రైతులకు చేరేలా., ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక సాగు సాంకేతికతను భారత రైతులకు తెలిసేలా వ్యవసాయ విధానాల రూపకల్పనకు సాయపడిన మహా మనిషి స్వామినాథన్‌గారు.  అన్నదాత కార్వనిర్వాహక సంపాదకునిగా  2019 జనవరిలో స్వర్ణోత్సవ సంచికకు వీరితో ప్రత్యేక వ్యాసం రాయించడం నేను మర్చిపోలేని జ్ఞాపకం. 

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అపార సేవలు అందించిన నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ చెరుకూరి వీరయ్యగారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం నుంచి పోలవరం వరకు సాగు నీటి ప్రాజెక్టులు, రైతుల సాగునీటి సమస్యలపై అవిశ్రాంతి కృషి చేశారు. 

కౌలు రైతుల శ్రేయం కోసం, బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులు,  కృష్ణా డెల్టా రైతుల నీటి సమస్యలు , సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ గారు...  వీరు ముగ్గురూ  24 గంటల తేడాతో చనిపోవడం రైతు లోకానికి పెను దుఃఖం కలిగిస్తోంది. పాతికేళ్లుగా వీరితో అనుబంధం మరువలేనిది.  రైతుల కోసం నిస్వార్ధంగా చేసిన వారి కృషి అనన్యసామాన్యం. తమ తమ పరిధిలో  రైతు శ్రేయం కోసం అలుపెరుగని కృషి చేసిన ఈ ముగ్గురికి నా నివాళులు. 🙏🙏🙏


Sunday 17 September 2023

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు💐💐