Pages

Wednesday 31 October 2012

ఈ చీకట్లను తరిమికొట్టండి!

                                                            
కరెంటు కోతలతో పరిశ్రమలే కాదు రాష్ట్రంలోని సకల జీవన రంగాలు కకావికలమౌతున్నాయి.  రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్ మిధ్యగానే మిగిలింది. ఎన్నో ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ రెండు మూడు గంటలకే పరిమితం కావడంతో పంటలు జీవం కోల్పోయాయి. వేళాపాళా  లేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 60 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడుతున్నాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎడురవనుందని ముందే తెలిసినా ముదస్తూ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, ట్రాన్స్ కో విఫలమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.                                                                                                                                 
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 900 మెగావాట్లే. నిండని జలాశయాలతో విద్యుత్ ఉత్పత్తి అతి స్వల్పంగా ఉంది. కీలకమైన బొగ్గు ఆధారిత విద్యుత్  109 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. సంప్రదాయేతర రంగంలో విద్యుత్ ఉత్పత్తి 903 మెగావాట్లకు మించడం లేదు. నెలకు 1500 కోట్లు అదనంగా ఖర్చు చేయగలిగితే కరెంటు పుష్కలంగా సరఫరా చేయవచ్చని నిపుణుల సూచనను పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతిరోజూ 65 మిలియన్ యూనిట్ల లోటు తేలుతోంది. దీన్ని భర్తీ చేయలేక ట్రాన్స్ కో, డిస్కం లు భారీ విధ్యుత్ కోతలకు  తెగబడుతున్నాయి. కోతల ఫలితంగా గత ఆరేడు నెలల్లో 20 వేల కోట్లకు పైగా వర్క్ ఆర్డర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చిన్న పరిశ్రమలు  లబోదిబోమంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న చీకట్లను తొలగించేందుకు  ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు నొక్కి చెబుతున్నాయి. ప్రజలు కూడా విద్యుత్ పొదుపును అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Tuesday 16 October 2012

"సూక్ష్మం" గ్రహిస్తే సేద్యం పదిలం!

భూసారం క్షీణించకుండా పది కాలా పాటు వ్యవసాయం నిలదొక్కుకోవాలంటే ఆచరించదగిన యాజమాన్య పద్దతులను సుస్థిర వ్యవసాయ విధానంగా వ్యవహరిస్తారు. ఈ విధానం కింద మన సహజవనరుల్ని సంరక్షిన్చుకోవడంతో పాటు సంప్రదాయ సాదు పద్దతులు, విత్తనా రకాలాను పరిరక్షించుకోవడం ద్వారా జన్యు వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. జన్యు, జీవ వైవిధ్యాన్ని కాపాడటమంటే మన వ్యవసాయాన్ని కాపాడుకోవటమే. నెలలో ఉండే సూక్ష్మజీవుల నుంచి భూమిపై బతుకుతూ పంటకు మేలు చేసే కీటకాల వరకు రైతునేస్తాలుగా పేరొందిన అన్ని రకాల జీవులనూ నాశనం చేసే రసాయన సేద్యంతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాం. సేద్యాన్ని పరాదీనం చేస్తున్నాం.జీవ, జన్యు వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాం. ఈ అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. అప్ లోడ్ చేసిన వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను.