Pages

Sunday 24 June 2012

మొలకెత్తిన విపత్తు!

విత్తన సంక్షోభం రాష్ట్ర రైతుల్ని పట్టి పీడిస్తోంది. ప్రణాళికా లోపం వల్ల విత్తనాల కొరత సీజన్ ముంగిట్లో రైతులకు కలవరం కలిగిస్తోంది. ముఖ్యంగా పత్తి విత్తనాలు దొరక్క రైతులు అల్లాడుతుంటే, నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తడంతో అన్నదాతలు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారిన రైతులకు సర్కారీ నిర్లక్ష్యం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ పరిణామాలపై  నేను రాసిన "మొలకెత్తిన విపత్తు!" వ్యాసాన్ని ఈనాడు ఆదివారం ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                

Thursday 7 June 2012

విత్తనంపై కార్పోరేట్ పెత్తనం


ఖరీఫ్ తొలినాళ్ళలోనే విత్తనాల కోసం రాష్ట్ర రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి రైతులు నకిలీ నాసిరకం విత్తనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేలైన కంపెనీల విత్తనాలు నల్ల బజారులో అధిక ధరలు పెట్టి కొనాల్సిరావడం రైతులకు భారంగా పరిణమించింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నమంటున్న  వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. పంటల సాగుకు ముఖ్యమైన ఉత్పాదకాలను కూడా మేలైనవి సరఫరా చేయలేక పోతున్న సర్కారీ నిర్వాకాన్ని ఎండగడుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు  "ఈనాడు" ప్రచురించింది. ఆ క్లిప్పింగును మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేసాను.