సాగు వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ఇస్తామంటే కనీసం ఇవ్వడానికి ప్రయత్నిస్తారేమో అనుకున్నా. ఇలా సాగు వ్యయాన్ని తగ్గించి చూపి చెవిలో పుష్పాలు పెడతారనుకోలేదు. కేంద్రం చూపుతున్న సాధారణ రకం వరి సాగు వ్యయం క్వింటాకు రూ. 1455. వాస్తవ సాగు వ్యయం రూ.3300. యాభై శాతం అదనంగా ఇవ్వడం కాదు రైతుకు సగం కూడా మద్ధతు ధర దక్కడం లేదు.