Pages

Thursday 29 September 2011

ఈ దోపిడీ ఎన్నాళ్ళు!

                                                        
రేపటి నుంచి మళ్ళీ ఎరువుల ధరలు పెరుగుతున్నాయనే విషయం రైతుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తి వేశాక ఈ ఏడాది ఇప్పటికి ఎరువుల ధరలు పైకి ఎగబాకటం ఇది పదమూడోసారి. తాజాగా డి.ఏ.పి., కాంప్లెక్స్ ధరలు బస్తాకు వంద నుంచి రూ.250 దాకా పెరగటం రైతుల్ని మరింత కుంగదీసింది. తాజా పెంపుతో రైతులపై సుమారు రూ. 500 కోట్ల భారం పడుతోంది. కేవలం వారం రోజుల్లోనే కంపెనీలు ఇలా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం నోరు మెదపకపోవడం పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ధరల పెంపుదలకు రూపాయి విలువ పెరగటమే కారణమని కంపెనీలు చెప్తున్నాయి. ఖరీఫ్ లో రైతులు గొడవ చేసినా పట్టించుకోని పాలకులు నేడు తీరికగా రబీ ప్రారంభమయ్యే నాటికి పోటాష్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి ఆనాడే దిగుమతి చేసుకుని ఉంటే నేడు ధరలు అదుపులో ఉండేవి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు అధిక ధరల భారం మోయాల్సి వస్తోంది.                                                  
                                                  
ఏది ఏమైనా చితికిన రైతుల్ని ఇంకా ఇంకా నష్ట పరిచే విధానాల వల్ల సేద్యం మరింత దిగజారుతుందని పాలకులు గ్రహించాలి. పండించిన పంటకు ధరల్ని నిర్ణయించుకునే స్వేచ్చ రైతుకు లేకుండా జాగ్రత్త పడుతున్న పాలకులు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి.. ఈ దేశంలో రైతులు ఆగ్రహిస్తే మీకు మింగ మెతుకుండదని గ్రహించి మెలగండి. వ్యవసాయ ప్రధాన దేశంలో మునుముందు రైతులు తిరగబడే పరిస్థితి తెచ్చు కోవద్దనేది పాలకులకు మరోసారి హితవు. నా పిచ్చి గాని ఈ చెవిటి పాలకులు తమ తప్పుల్ని గుర్తిస్తారంటారా....?  ప్చ్...! 

No comments: