Pages

Thursday 11 August 2011

పంట విరామంపై కందా నేతృత్వంలో కమిటీ

                                                                                                                                                          
పంట విరామం ప్రకటించి  ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేసిన రైతుల్ని ఊరడిన్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం మోహన్ కందా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. వ్యవసాయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కందా గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవజ్ఞులు. పంట విరామానికి దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను ఈ స్వతంత్ర కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ కమిటీలో ప్రముఖ వ్యవసాయ శాస్రవేత్త పద్మశ్రీ ఎం.వి. రావు, రంగా వర్సిటి డి.ఆర్.  సుధాకర రావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ కే. సుదీర్, కే. ప్రతాపరెడ్డి లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా ఉంటారు. 4 వారాల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది. కొనసీమతో పాటు పలు జిల్లాల్లో 1 .35 లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం పాటిస్తున్న సంగతి తెలిసిందే. సమస్య గురించి తెలిసినా కమిటీల పేరుతొ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటాన్ని రైతు నేతలు విమర్శిస్తున్నారు. పంట విరామం పాటించి ఈ సీజన్లో ఉపాధి కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన అవసరముంది. 

No comments: