Pages

Friday 12 August 2011

"అగ్రి ఇండియా" రైతుల కన్నీళ్ళు తుడుస్తుందా..?

                                                            
 వ్యవసాయరంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం "అగ్రి ఇండియా" పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుందట..! ఇందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగాలకు కేంద్ర కేబినేట్ అనుమతి లభించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి రూపొందించే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విత్తనాలు, పనిముట్లు, పశువుల టీకాలు... వగైరా అంశాల్లో మేధో హక్కుల పరిరక్షణతో  పాటు వాటిని వాణిజ్యపరంగా అమల్లోకి తేవడం, సాంకేతికతను మార్కెటింగ్ చేయడం, రైతులకు అవగాహన కల్పించడం ఈ కంపెనీ ఉద్దేశం. 
                                                               
            రైతులకు ఏం చేయాలో ఎటువంటి చర్యలు తీసుకుంటే వారి పరిస్థితి  మెరుగు పడుతుందో డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ ఏనాడో సూచించింది. మన రాష్ట్రంలో వై.ఎస్. జమానాలో అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ సంగతిని ఆయనే మర్చిపోయిన విషయం ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తోంది. వ్యవసాయ సంస్కరణలు అమలుతో రైతుల పరిస్థితిలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు నిపుణుల సిఫార్సులు ఎన్నో అందుబాటులో ఉండగా కోట్లు ఖర్చు పెట్టి కమిటీల పేరిట ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం ప్రభుత్వానికే చెల్లింది. 2003 లో ఆమోదించిన విత్తన చట్టాన్నే ఇంకా పార్లమెంటులో చట్ట రూపంలోకి తెచ్చుకోలేకపోయాం. ఈలోగా ఆ చట్టం సైతం మరెన్నో మార్పులు సంతరించుకోవాల్సి ఉంది. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని పాలకులు, పవార్ లాంటి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి ఉన్నంత కాలం వారి బతుకులు బాగుపడతాయనుకోవడం భ్రమే.

No comments: