Pages

Friday 4 May 2012

పాడి పరిశ్రమకు కేంద్రం చేయూత!

                                                                 
భారత్ వ్యాప్తంగా పాడి పశువులకు బీమా పధకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2006లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పధకం నేడు దేశంలో 300 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి పది లక్షల పశువులకు  బీమా సదుపాయం కల్పించనున్నారు. బీమా ప్రీమియంలో సగం రైతులు భరించాల్సి ఉండగా., మిగిలింది ప్రభుత్వం భరిస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల  అభివృద్దికి సంబంధించి ఏర్పాటైన పార్లమెంటరి స్థాయి సంఘం అధ్యయనం చేసిన నివేదిక నిన్న పార్లమెంటు ఉభయ సభలకు అందింది. నివేదికలోని అంశాల ప్రకారం దేశంలో పాడి పురోగతికి కేంద్రం ఇతోధికంగా సాయపడనుంది. దేశంలో పాల ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి, నాణ్యమైన పశువుల పెంపకానికి కేంద్రం రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు అందించనుంది. అలానే పశువులకు కావలసిన వైద్య సదుపాయాలను మెరుగుపరచేందుకు గ్రామాల్లో వైద్యశాలలను ఏర్పాటుచేయనున్నారు. తరచుగా వైపరీత్యాల బారిన పడుతున్న రైతులకు  పాడి నిజంగా కలిసివచ్చేదే. ఈ పధకాల గురించి రైతుల్లో మంచి అవగాహన కల్పిస్తే అన్నదాతలు వీటి ప్రయోజనాలు పొందగలుగుతారని కేంద్రం గుర్తించాలి.

No comments: