Pages

Tuesday 1 May 2012

రైతుకు చెక్కుల ద్వారా చెల్లింపులు సాధ్యమా..?

                                                                                            
దేశంలో జరుగుతున్న బియ్యం సేకరణలు, ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను ఆధునికీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.  దీనిలో భాగంగా కొనుగోళ్ళ వివరాలను అత్యంత పారదర్శకంగా అన్ లైన్ లో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో జరిపే చెల్లింపులు అక్కౌంట్ పేయి చెక్కుల ద్వారా జరపాలని, రైతుల నుంచి జరిపే కొనుగోళ్ళ వివరాలను కంప్యుటరీకరించి ఆన్ లైన్ లో  అందుబాటులో ఉంచాలని కూడా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. వీటికి తోడూ ఇదే పద్దతిని మిల్లర్లు జరిపే లావాదేవీలకు కూడా  వర్తింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కోస్తా, రాయల సీమల్లో బ్రోకర్ల ద్వారా జరిపే క్రయ విక్రయాల విషయంలో ఈ చెక్కుల పెమెంట్లు జరపడం 
 సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పద్దతిద్వారా కేవలం చెక్కుల తో చెల్లింపులే కాకుండా రైతుల నుంచి మిల్లర్లు యెంత ధాన్యం కొన్నారు..? ఏ వెరైటీని ఏ ధరకు కొన్నారు వంటి వివరాలు ఆన్ లైన్ లో ఉంచాలనేది కేంద్ర ప్రణాళికలో భాగం. ఒక రకంగా రైతుకు మద్దతు ధరను అందించాలనే కేంద్ర ప్రయత్నంలో ఇదొక భాగంగా చెప్పవచ్చు. 
దీనివల్ల....
ధాన్యం సేకరణ తేలిక అవుతుంది. మెరుగైన మిల్లింగ్ మేనేజ్ మెంట్ సాధ్యపడుతుంది. అలానే కష్టం మిల్లింగ్ కోసం మిల్లుల నమోదు, మిల్లుల వారి జరుగుతున్నా ధాన్యం పంపిణీ సమాచారం క్షణాల్లో పొందటం ద్వారా సమయం ఆదా అవుతుంది. 
అయితే...,
ధాన్యం సేకరణ, ఎఫ్ సి ఐ డెలివరి, గోదాముల్లో నిల్వ, రవాణా, చలామణి వంటి నిత్యం ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరించటంలో   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు విఫలమవుతున్న తరుణంలో ఈ కొత్త విధానాల అమలు పెద్ద సవాలు కానుంది. రైతుకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఈ తరహ సమస్యలని పరిస్కరిస్తే కొత్త విధానం ద్వారా మంచి ఫలితాలు పొందే వీలుంటుంది.

No comments: