Pages

Wednesday 14 March 2012

చెరకు రసం తీసే ఆధునిక యంత్రంతో యవతకు ఉపాధి

                                                               
చెరకు సాగు రాష్ట్ర రైతులకు చేదునే మిగుల్చుతోంది. చక్కెర మిల్లులు సైతం పర్మిట్లు ఇవ్వకుండా రైతుల  సహనాన్నిపరీక్షిస్తున్నాయి. టన్ను చెరకుకు కేవలం రెండు వేల ధర మాత్రమే ఇస్తూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇస్తున్న స్థాయిలొనూ  రాష్ట్ర సలహా ధరను ఇవ్వకుండా సర్కారు రైతుల్ని మోసగిస్తోంది. ఏటా ఎదురవుతున్న  ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో చెరకును మిల్లులకు తరలించలేని రైతులు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న వారు స్వయం ఉపాధిగా చెరకు రసం తీసే యంత్రాలను ఏర్పాటుచేసుకుని లాభాపడవచ్చు. ముఖ్యంగా యువతకు ఈ ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయి. నేడు మనం రోడ్లపై చూస్తున్న చేతితో నడిపే లాంటివి కాకుండా ఇన్ స్టంట్ కూలింగ్ సదుపాయమున్న ఈ యంత్రాలు నేడు హైదరాబాద్లో ( 93944 93944 - రాంగోపాల్ )తయారుచేస్తున్నారు. ఆ వివరాలతో రాసిన నా వ్యాసం మార్చి నెల "అన్నదాత" లో ప్రచురితమైంది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ లింక్ చేస్తున్నాను. మీ కోసం.
                                                           

No comments: