కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చేసిన ఒక చెత్త పని వల్ల దేశంలో పత్తి
ధరలు పడిపోయాయి. క్షేత్ర స్థాయిలో రైతుల స్థితిగతులను పట్టించుకోని కేంద్ర
ప్రభుత్వ నిర్వాకాన్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. అంతర్జాతీయంగా గిరాకి
కొనసాగుతున్నా పత్తి నిల్వలు పుష్కలంగా ఉన్నా ఇవేమీ పట్టించుకోకుండా ఆనంద్
శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. ఒక వ్యూహం లేకుండా ఎగుమతి దిగుమతి
విధానాలను రచిస్తున్న కేంద్రం దేశంలో కోట్లాది పత్తి రైతుల ఆశలపై నీళ్ళు
చల్లింది. జరిగిన పొరపాటును గ్రహించి నేడు దిద్దుబాటు చర్యల గురించి
ఆలోచించమని ది గ్రేట్ మన్మోహన్ గారు ప్రణభ్ ను పురమాయించారు. ధరల పతనానికి
దారితీస్తున్న జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు
ఈనాడు ప్రచురించింది. ఆ కాపీ ని మీ కోసం ఇక్కడ
జతచేస్తున్నాను.
No comments:
Post a Comment