Pages

Thursday 22 March 2012

600 రైతు క్లబ్బులకు "నాబార్డు" చేయూత


రాష్ట్రంలో కొత్తగా మరో 600  రైతు క్లబ్బులకు చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు "నాబార్డు" నేడు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఆఖరికి దేశం మొత్తంలో 91675 క్లబ్బులు ఉండగా., వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లోనే 6594 క్లబ్బులు (7 . 2 శాతం ) ఉన్నాయి. రైతు క్లబ్బుల ఏర్పాటుకు, మూడేళ్ళ పాటు నిర్వహణ ఖర్చులు, నిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించడానికి., కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , ఆదర్శ రైతుల పొలాలను పరిశీలించడం వంటి ప్రయోజనకరమైన పనులకు నాబార్డు ఆర్ధిక సహకారం అందిస్తూ ఉంటుంది.
  సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి, రుణాలు, మార్కెట్ పట్ల అవగాహన పెంచడం, వ్యవసాయదారుల సామర్ధ్యం పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల సత్వర అభివృద్ధికి కృషి చేయడమే ఈ రైతు క్లబ్బుల ప్రదాన ఉద్దేశం. అందరూ కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రైతు క్లబ్బులు ఉత్తమ వేదికలుగా పని చేస్తున్నాయి. అయితే వీటి పనితీరును మెరుగు పరచడం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు  మరింతగా ఉపకరించేలా తీర్చిదిద్దటం నేడెంతో అవసరమని నా భావన. 

No comments: