Pages

Tuesday 21 February 2012

ఇది రైతు ప్రభుత్వమా... హవ్వ! - జేపీ

                                                            
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రైతాంగ సమస్యలపై  ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కిలో కందిపప్పు ధర రూ. 100 అయినప్పుడు గగ్గోలు పెట్టిన నాయకులు నేడు రైతుకు కిలో కందిపప్పుకు కేవలం రూ. 30 ధర వస్తోంటే నోరుమెదపడంలేదని విమర్శించారు. ఉత్పత్తులకు తగిన ధర కల్పించలేని ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా భావించాలా  అని ప్రశ్నించారు. తన చేతకాని విధానాలతో రైతుల పరిస్థితిని దిగజార్చిన ప్రభుత్వం, వారిని నిలువునా మోసగిస్తోందని, విద్యుత్ కోతలతో అటు రైతుల్ని ఇటు పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతోందంటూ జేపీ కిరణ్ సర్కారు వైఖరిని తూర్పార పట్టారు. క్షేత్ర స్థాయిలో రైతుల దుర్గతిని పట్టించుకోకుండా ప్రభుత్వం మన్ను తిన్న పాములా వ్యవహరిస్తే రైతుల బాగోగుల్ని ఎవరు పట్టించుకున్తారని నిగ్గదీశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల నికరాదయం తగ్గుతోందని, ఆ మేరకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దున్న పోతుపై వాన పడ్డ చందంగానే ఉంది. 

No comments: