జీడిపప్పును ప్రాసెస్ చేసే క్రమంలో రైతులు, కార్మికులు కొన్నేళ్ల క్రితం వరకు తీవ్ర కాలుష్యంతో అనారోగ్యం పాలయ్యేవారు. స్టీమ్ బాయిలర్లు వచ్చాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కానీ రైతు స్థాయిలో ముఖ్యంగా కుటీర పరిశ్రమల వారు చాలా మంది జీడిమామిడి ప్రాసెసింగ్లో సంప్రదాయ పద్ధతైన డ్రమ్ రోస్టింగ్ పద్ధతినే అనుసరిస్తున్నారు. యాంత్రీకరణ రైతుస్థాయిలో విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ అందుకు చిన్న రైతులకు యంత్రాల ఖరీదు, వాటి లభ్యత గురించిన సమాచారాన్ని ఈ నెల అన్నదాత మాసపత్రికలో వచ్చిన నా వ్యాసం ద్వారా అందించాను.
No comments:
Post a Comment