Pages

Wednesday 26 December 2012

తెలుగింటి పండగ

                                                                
అజంత భాషయిన తెలుగు మాధుర్యాన్ని దేశ దేశాల్లోని తెలుగు వారందరికీ చేరువ చేయడం లక్ష్యంగా నేడు ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలు 226 విభిన్న కార్యక్రమాలతో తల్లిభాషకు శోభను చేకూర్చబోతున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం, వికాసానికి కృషి చేయడం, శాస్రీయ జానపద కళారూపాలను ప్రోత్సహించడం, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, మాదలిక పదకోశాల రూపకల్పన తదితర 9 ప్రధాన ఆశయాలతో ఈ సభలు జరగనుండటం విశేషం.
అయితే.., పరాయి భాషా వ్యామోహంలో అమ్మ భాష అంతరించిపోయే దుస్థితిని కొని తెచ్చుకొంటున్నాం. సోదర తమిళులు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానంలో మనకు ఒక వంతు కూడా లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. చట్టబద్దంగా తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను దాని పర్యవేక్షణ కిందకు తీసుకురావాలన్న భాషోద్యమకారుల కోరికను తీర్చే దిశగా మనం ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరముంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను ఆధునికీకరించడం నేడెంతో అవసరం. భోధనా భాష కాకుండా అమ్మభాష బతకజాలదని నేడందరూ గుర్తించి పాలకులతో సహా అందరూ గుర్తించి ఆచరించాల్సిన తరుణమిది.  తెలుగు భాష వికాసం లక్ష్యంగా ఇది మన తెలుగు వారందరి గురుత బాధ్యత. మన కర్తవ్యం కూడా..!

2 comments:

Chinni said...

హరికృష్ణ గారు,
ఈ సభలు తగిన చిత్తశుద్ధితో జరుగుతున్నాయంటారా?

అమిర్నేని హరికృష్ణ said...

Mitrama..
aa chittasuddhi lopinchindane mana badhantaa....!