Pages

Saturday 31 March 2012

రైతులకు కరెంటు వాతలు

                                                                
అధికారికంగా ఇచ్చేది ఏడు గంటల కరెంటు. అమలులో రైతులకు అందుతున్నది నాలుగు గంటలు కూడా లేదు. ఇప్పటికే సక్రమంగా విధ్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడుతున్న రైతులపై  ప్రభుత్వం నేడు చార్జీల భారం మోపి వారిని మరింతగా కుంగదీసింది.  పంటల సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్ కు 3 రూపాయల 20 పైసలు వసూలు చేస్తామనడం రైతులకు నిజంగా పెద్ద షాక్! 2014 దాకా కరెంటు చార్జీలు పెంచబోమని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ సర్కారు నేడు దాన్ని విస్మరించిన తీరు శోచనీయం. తాను బకాయి పడ్డం వల్లనే విధ్యుత్ సంస్థల్ని సంక్షోభంలోకి నెత్తిన సర్కారు  ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దటం ఘోరం. ఎవరి గొడవలు వాళ్ళు చూసుకుంటున్న రాష్ట్రంలో అసలు ప్రజా సంక్షేమం విస్మరిస్తుండటం అసలైన విషాదం.

No comments: