Pages

Wednesday 7 December 2011

విషాద పర్వంలో చెరకు రైతు

ఎరువులు, డీజిల్ ధరలతో పాటు బహిరంగ మార్కెట్లో అన్ని రకాల ధరలు పెరిగి ఇప్పటికే సగం చచ్చిన చెరకు రైతుల్ని అటు మిల్లులు ఇటు ప్రభుత్వం బంతాడుకుంటున్నాయి. పెట్టుబడులు రెట్టింపైన తరుణంలో రైతుకు మంచి ధర ఇవ్వాల్సిన వారు చేతులెత్తేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర కూడా ప్రకటించకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లులకు సలహాలిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండీ లేనట్టు వ్యవహరిస్తుండటం చూస్తుంటే రైతుల్ని పట్టించుకునే తీరిక ఈ సర్కారుకు లేదన్న సంగతి స్పష్టమవుతోంది. చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అంతర్జాతీయంగా పంచదార ధరలు, ఎగుమతులు, కేంద్ర, రాష్ట్ర సర్కార్ల స్పందనల పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు గురువారం  'ఈనాడు'  ప్రచురించింది. స్కాన్ చేసిన ఈ కాపీని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను. కృతఙ్ఞతలు.
                                                               

No comments: