ఇజ్రాయెల్ వ్యవసాయంపై తెలుగులో తొలి పుస్తకం "ఎడారిలో ఒయాసిస్సు" ఆగస్టులో ఆవిష్కరించాక కేవలం రెండు నెలల్లోనే తొలి ఎడిషన్ పుస్తకాలు అయిపోయాయి. రెండో ముద్రణ కూడా అచ్చు వేయించాను. ఈ కవర్ పేజీ ద్వితీయ ముద్రణదే. అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. విజయవాడ బుక్ ఫెయిర్ లోనూ ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో రైతుల ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్ధ తాజా నివేదిక విడుదలైన నేపథ్యంలో రైతులు బలవన్మారణాలకు కారణాలు, కొన్ని పరిష్కారాలపై నేను రాసిన వ్యాసం డిసెంబరు నెల "అన్నదాత" లో ప్రచురితమైంది.