Pages

Wednesday 30 April 2014

వ్యవస్థలతో పాటు వ్యవసాయాన్నీ దోచేశారు!

వ్యవసాయాన్ని పండగ చేస్తామన్న పాలకులు తమ దుర్నీతితో రైతు బతుకుల్ని ఛిద్రం చేశారు. గడచిన పదేళ్ళలో సేద్యంలో ఉత్పత్తి  పెరుగుదల నమోదైనా ఆ మేరకు రైతుల నికరాదాయం ఏ మాత్రం పెరగకపోవటమే ఇందుకు నిదర్శనం. దేశంలో 45 శాతం రైతులు అప్పుల్లో ఉంటె, ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 82 శాతంగా ఉందని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.  దీన్ని బట్టి వ్యవసాయం పండగ  అంటే అది ఎవరికి పండగ అయ్యిందనే విమర్శలే నిజం. వ్యవసాయం లో ఉత్పత్తి ఖర్చులు వందల శాతం పెరిగినా ఆ మేరకు రైతుకు గిట్టుబాటు ధర దక్కటంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల బతుకుల్లో మార్పు రావటం లేదు. వ్యాసంలో పేర్కొన్నట్టు., రైతుకు ఎప్పుడు ఏం కావాలో అది అందించకుండా సేద్యానికి తోడ్పాటు ఇస్తున్నట్టు నటిస్తే వ్యవసాయం నుంచి వలసలు పెరుగుతాయని హెచ్చరిస్తున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.