Pages

Wednesday 18 November 2020

“ఆశయం” ముందుమాట

 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌ గా విశిష్ట సేవలందించి తన విశ్రాంత జీవితంలో అనుభవాల సారంతో పల్లెల ప్రగతికి ఏం చేయాలనే అంశంపై "ఆశయం" అనే నవలను రచించారు శ్రీ తోట సాంబశివరావుగారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ఈ నవలకు నాకు ముందుమాట రాసే అవకాశాన్ని అందించిన వారికి ధన్యవాదములు.





Friday 13 November 2020

🪔 దీపావళి శుభాకాంక్షలు 🪔🪔

 🪔🪔✨✨కష్టాల చీకట్లను తొలగించి ఈ దీపావళి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.  -  అమిర్నేని హరికృష్ణ ✨✨🪔🪔


Saturday 7 November 2020

ఆచార్య ఎన్జీ రంగా జయంతి -ఆత్మీయ సత్కారం

రైతు బాంధవుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 120 వ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశం ఇది.  మాజీమంత్రి, రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాకు ఆత్మీయ సత్కారం చేసిన ఆచార్య రంగా కిసాన్ సేవా సమితి కి,  శోభనాద్రీశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.









Sunday 1 November 2020

మట్టిభాష తెలిసిన రైతు మేధావి నాగరత్నం నాయుడు

ఎకరా, రెండు ఎకరాలున్న రైతులు కూడా స్ధిరమైన ఆదాయం పొందే విధానాలు ఉన్నాయి. బయటి నుంచి కొనే అవసరం లేకుండా నిత్యం మన అవసరాలకు వాడే పూలు, పండ్లు సహా ఆహారమంతా పొలంలోనే పండించుకోగలిగితే, ఆ రైతు ఎవరిపైనా ఆధారపడాల్సిన పని ఉండదు. సరిగ్గా అటువంటి విధానాలను ఆచరించి చూపడమే కాకుండా ప్రకృతి సేద్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై దేశ వ్యాప్తంగా తోటి రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు. ఆయనపై నేను రాసిన కవర్ స్టోరీ నవంబరు 2020 అన్నదాత మేగజైన్ లో ప్రచురితమైంది.