Pages

Wednesday 30 November 2011

రైతు ఖర్చుకు తగ్గ ధరల్లేవు- సి.ఏ.సి.పి

                                                           
రైతులకు అవుతున్న వాస్తవ సాగు ఖర్చులకు ప్రభుత్వం ప్రకటిస్తున్న ధరలకు ఏంటో వ్యత్యాసం ఉందని వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం (సి.ఏ.సి.పి) కేంద్రానికి చురకలు వేసింది. కేంద్ర విధానాల వల్ల వరి రైతులు తమకు న్యాయంగా రావాల్సిన మొత్తాన్ని కూడా దక్కించుకోలేక పోతున్నారని సి.ఏ.సి.పి అభిప్రాయపడింది. ముఖ్యంగా వరి రైతులు   16  నుంచి 25  శాతం ఆదాయం కోల్పోతున్నారని నివేదికలో పేర్కొంది. రైతులు పెడుతున్న ఖర్చులు, వారికి దక్కుతున్న ధరలపై లోతుగా అధ్యయనం చేసిన సి.ఏ.సి.పి, ఈ మేరకు ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేసింది.  పలు పంటలకు ధరలను నిర్ణయించేటప్పుడు దేశంలో ఆయా ఉత్పత్తుల గిరాకి, సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కూడా కమిషన్ సూచించింది. ఇకపై బియ్యం లెవీ 25 శాతానికి మించకుండా చూడాలని సి.ఏ.సి.పి ప్రభుత్వాన్ని కోరింది. గత ఏడాది  రైతులు సాగు చేసిన వరి వంటి కొన్ని పంటల్లో వారికి లాభసాటి ధరలు దక్కలేదని తేల్చింది. నిల్వ పద్ధతులు సక్రమంగా లేకపోవడం వల్ల ఏట పదిస్తున్న ఆహార ధాన్యాలను భారీగా నష్టపోతున్నామని, ఇందుకు ఆహార ధాన్యాలను అధికంగా నిల్వ చేయవద్దని, అదనపు నిల్వలను స్వేచ్చా మార్కెట్లో విక్రయించాలని కోరింది. ఆహారధాన్యాలను టోకుగా విక్రయించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని సూచించింది. ప్రైవేటు రిటైల్ చైన్లను ప్రోత్సహించాలని మండీ వ్యవస్థను సంస్కరించాలని కూడా సూచించింది. మొత్తంగా కేంద్ర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు రైతుల వాస్తవ సాగు వ్యయాలను మదింపు చేసి వారికి లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు పాటించాలని సి.ఏ.సి.పి కేంద్రాన్ని   కోరింది. కళ్ళుండీ రైతు కష్టాలను చూడలేకపోతున్న పాలకులకు ఇవి కనువిప్పు కావాలి.

No comments: