Pages

Monday 28 November 2011

కరవుపై కార్యాచరణ ఏదీ?

                                                                        
వ్యవసాయంతో బతుకు ఆట ఆడేదీ ఓడేదీ రైతే! రాష్ట్ర రైతాంగానికి ఖరీఫ్ కలసిరాని కడగండ్ల సేద్యమే అయ్యింది. మరికొన్ని కరవు మండలాలను గుర్తించి మొత్తం సంఖ్యను 772 కు పెంచేసిన ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటిదాకా ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో మొదలు పెట్టి ధాన్యం కొనుగోలు, మద్దతు ధర చెల్లింపు .. ఇలా అన్నింటా ప్రభుత్వ ప్రణాళికా రాహిత్యం రైతు బతుకును కన్నీటిమయం చేస్తోంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే, కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక సహకార సంఘాలు, కొనుగోలు సంస్థలు  పెద్ద ఎత్తున రంగంలోకి దిగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు నమ్మబలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పూర్తి విరుద్దమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కరవు రైతుల్ని ఆదుకుని రబీ పంటలు వేసుకునేలా వారికి తోడ్పడాల్సిన పాలకులు కరవు మండలాలు ప్రకటించి నెల గడుస్తున్నా తగిన కార్యాచరణను ప్రకటించక పోవడాన్ని ఏమనాలి?   రాష్ట్రంలో రైతుల్ని పట్టించుకునేవారు లేరు., అసలు వ్యవసాయానికి ఒక మంత్రే లేడు., ఇంతకీ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా....?

No comments: