రానున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహ తంత్రంగా ఆహార భద్రతను కేంద్రం అడ్డం పెట్టుకోవడం లేదు కదా అన్న అనుమానం కలుగుతోంది. 2009 ఎన్నికల్లో యుపీఏను ఉపాధిహామీ ఆడుకున్నట్టుగానే, 2014లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆహార భద్రత కాపాడుతుందన్న వాదన వినిపిస్తోంది. అసలు అంతకంటే ముందు అంటే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రతా బిల్లుపై యూపీ సర్కారు ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తోంది. కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ సారధ్యంలోని మంత్రుల సంఘం ఒప్పుకున్న ఆహార భద్రతాబిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, తర్వాత స్థాయీసంఘం పరిశీలనతో చట్టంగా మారడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఇదంతా వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని కావాలని చేస్తున్న జాప్యమేనన్న సందేహం కలుగుతోంది.
ఒకవేళ బాలారిష్టాలన్నీ దాటి ఇది ప్రజల ముందుకు వచ్చినా దీన్ని సక్రమంగా అమలు చేయడం అనుమానమే. ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతపైనే ఆసలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎటొచ్చీ ఆహార భద్రత చివరికి ప్రజలను పరిహసించే రాజకీయ క్రీడగానే మిగిలిపోతుందేమోనన్న భయం కలుగుతోంది.
No comments:
Post a Comment