Pages

Saturday 5 November 2011

రైతులంటే ఎందుకంత కసి!

                                                     
ఎరువుల ధరలు మళ్ళీ పెంచారు. రైతు చితికి చితికి పోతున్నా పాలకులకు సిగ్గు రావటంలేదు. ధరలపై నియంత్రణ ఎత్తి వేసిన నాటి నుంచి ఎరువుల ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచేస్తున్నాయి. దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాచుర్యం పెరిగితే, ఆ మేరకు రైతుల్లో అవగాహన పెరిగితే  ఈ కంపెనీలు సగం మూతపడటం ఖాయం. ఈ ఏడాది ఇప్పటికే 13 సార్లు  ఎరువుల ధరల్ని పెంచేసిన కంపెనీలు ఈ నెలలో రెండోసారి ధరలను పెంచేందుకు సాహసించడం కేంద్ర పాలకుల పుణ్యమే. పెట్రో ధరల్లా ఇష్టానుసారం ఎరువుల రేట్లను పెంచేస్తున్న కంపెనీలు, ఇప్పటికే అప్పుల పాలైన రైతుల బాగోగులు పట్టించుకోని కేంద్రం ఇందుకు తగిన మూల్యాన్నే చెల్లించుకుంటాయి. రైతులు ఎక్కువగా వాడే డై అమ్మోనియం ఫాస్పేట్ (డి,ఏ.పి) ధరను గడచినా ఆరు నెలల్లో బస్తాకు రూ.300 కు పైగా పెంచారు. తాజాగా బస్తా ధర వెయ్యికి చేరింది. ధరలు ఎక్కువ కావడంతో డి.ఏ.పి కొనుగోళ్ళు తగ్గడంతో కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరల్ని పెంచుతున్నాయి. 
                                                         తాజాగా ఫాక్ట్ కంపెని 20 :20 :0:13 ఎరువు 50 కిలోల బస్తా ధరను రూ.674 .93 నుంచి ఏకంగా వంద రూపాయలు పెంచింది. అలానే జింక్ కలిసి ఉండే బస్తా ధరను కూడా బస్తాకు రూ. 95 వరకు పెంచేశారు. ఒక పద్దతంటూ లేకుండా ఇష్టానుసారం ధరల్ని పెంచుతున్న కంపెనీలు, పాలకులు తమ పొరపాట్లను గుర్తించకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావడం తప్పనిసరి.

No comments: