Pages

Wednesday 4 January 2012

రేపటి నుంచి ఒంగోలులో ప్రపంచ తెలుగు మహోత్సవం

                                                                   
ప్రపంచ తెలుగు మహోత్సవం రేపటి నుంచి ఒంగోలులో ప్రారంభం కానుంది. ఒంగోలులోని  పీ.వీ.ఆర్. పురపాలక ఉన్నత పాటశాలలో తెలుగు మహోత్సవాలు నిర్వహించనున్నారు. రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడెమి, న్యూడిల్లీ, ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈమహోత్సవంలో రాష్ట్రానికి చెందిన కళారూపాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం పాల్గొంటున్నారు. రాంకీ ఫౌండేషన్ హెడ్ ఎంవీ రామిరెడ్డి ఈనాడు ఆఫీసుకు వచ్చి ఈ ఉత్సవాల్లో వ్యవసాయంపై ఉపన్యసించాలని కోరారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ఛానల్ సమావేశాలు ఉన్నందున బిజీ గా ఉండటంవల్ల సాధ్యపడదని చెప్పి కృతఙ్ఞతలు తెలిపాను. తీవ్రమైన  పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది.
                                      
ఈ మహోత్సవంలో స్త్రీ చైతన్యం., వ్యవసాయం., ప్రచార ప్రసార సాధనాలు., సాంస్కృతిక ప్రదర్శనలు., సాహిత్యం., ఉపాధి కల్పనా., విదేశీ స్వదేశీ ప్రతినిధుల చర్చ., ప్రజా ప్రతినిధుల గళం., అష్టావధానం., భాష., పర్యావరణం., విద్య., చరిత్ర సంస్కృతీ., తదితర అంశాలపై చర్చలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు., జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అన్ని రంగాల ప్రముఖులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు.

No comments: