Pages

Saturday 14 January 2012

ఈటీవీ- 2 లో నేటి రాత్రి 9 గంటలకు సంక్రాంతిపై ప్రత్యేక చర్చ

                                                                                                                                    సమ్యక్ క్రాంతి  సంక్రాంతి. సంప్రదాయాలలోని సౌందర్యాన్ని, అంతర్లీన సందేశాన్ని ., ఒక తరం నుంచి మరో తరానికి అందించే పెద్ద పండుగ సంక్రాంతి. నేటి భోగి రోజు రాత్రి 9 గంటలకు ఈటీవీ- 2 ప్రతిధ్వని కార్యక్రమంలో "సంక్రాంతి శోభ" పేరిట పండుగ విశిష్టతపై ఒక చర్చా కార్యక్రమం నిర్వహించాము.  ఈ చర్చలో సాహితీవేత్త, అవధాని డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, పరిశోధకులు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీతా రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. సంక్రాంతి గొప్పదనాన్ని తెలియజేసే సంగతులెన్నో ఈ చర్చలో చోటు చేసుకున్నాయి.
                                                          
సంక్రాంతి అంటే పవిత్ర దివ్యకాంతి. హృదయానికి శాంతిని ప్రసాదించేదే సంక్రాంతి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పాడిపంటలు, పిండి వంటలు, కొత్త దుస్తులు, బందుమిత్రులతో సంక్రాంతి సందడి గ్రామ గ్రామానా వెల్లివిరుస్తోంది.  భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువులతో నేడు భోగి కనువిందు చేస్తుంటే., రేపటి మకర సంక్రాంతి ఎల్లుండి కనుమ పండుగ సంబరాలను పతాక స్థాయికి తీసుకువెళతాయి. ఎటొచ్చీ రైతుల పండుగ నాడు అన్నదాతలే ఆనందంగా లేరు. ఈ పండుగ అందరికీ సకల శుభాలను అందించాలని కోరుకుంటూ బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
                                  మీ
                         అమిర్నేని హరికృష్ణ

No comments: