Pages

Wednesday 21 December 2011

స్వతంత్ర భారతంలో చెత్త వ్యవసాయ మంత్రి ఎవరు ?

                                                     
కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చెంప చెళ్ళుమని పించినా ఆయనకు బుద్ధి రావటం లేదు.  స్వతంత్ర భారతంలో అత్యంత పనికిమాలిన వ్యవసాయ మంత్రిగా కీర్తిని సంపాదించుకున్న పవార్ రైతాంగ సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ మనుగడ కోసం కాంగ్రెస్ పవార్ తప్పిదాలను వెనకేసుకు వస్తూ పెద్ద తప్పే చేస్తోంది. పార్లమెంటులో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా అటు ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ సభ్యులు ఆయన తీరును కడిగేసినా సిగ్గు రావటం లేదు. దేశంలో పామాయిల్ రైతులకు కిలోకు రూ. 15 సబ్సిడీ ఇవ్వమంటే కుదరదన్న మంత్రి., విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలపై 20 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని  స్వయంగా కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. నిజంగా ప్రపంచంలో ఆ మాటకొస్తే పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మలేసియా కంటే  ఆయిల్ పామ్ సాగుకు మంచి భూములున్న ఆంధ్ర ప్రదేశ్లో ఈ పంట సాగుకు ఆశించిన ప్రోత్సాహాలు అందటం లేదు. దేశంలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వారి సంక్షేమాన్ని  విస్మరిస్తున్న పవార్ వంటి మిత్రపక్ష మంత్రుల్ని సరిచేయాల్సిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేక పోవడం వల్లనే. పవార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రైతాంగ శ్రేయం కోసం దృష్టి పెట్టు.