Pages

Monday 12 December 2011

వ్యవ'సాయం' పెంచండి..!

                                                             
వ్యవసాయం పూర్తిగా చతికిలపడింది. శక్తి లేక రైతులు బాగా నీరసించారు. వారికి శక్తియుక్తులు కల్పించడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో వచ్చే ఫలితాల గురించి ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం కంటే తక్షణం నిర్వర్తించాల్సిన కర్తవ్యం గురించి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడటం లేదు. బ్యాంకర్ల సమావేశంలో రైతులు కరవుతో సతమతమవుతున్నందువల్ల వారికి విరివిగా రుణాలందించి ఆదుకోవాలని కోరారే తప్ప కరవును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించలేదు. వచ్చే రెండేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు సుమారు ఆరువేల కోట్లు ఖర్చు పెడతామన్న ముఖ్యమంత్రి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడితే బాగుండేది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం చేయూతనిస్తే రైతులు నిలదోక్కుకోగలుగుతారు. క్షేత్ర స్థాయిలో రైతుల వాస్తవ సమస్యలను తెలుసుకొని వాటిని చక్కదిద్దాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు ఓదార్పు నిచ్చేలా ప్రభుత్వం కరవు సహాయ చర్యలు చేపట్టాలి. రైతుకు కావలసిన ఉత్పాదకాలను సకాలంలో గ్రామస్థాయిలోనే అందించాలి. దళారుల బెడద లేకుండా చేసి మంచి ధరలిస్తే అన్నదాతల పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రభుత్వం ఈ మాత్రం చర్యలు చేపట్టినా రైతులకు చాలా వరకు మేలు జరుగుతుంది. కనీసం వీటిని చేయడానికైనా పాలకులు సిద్ధంగా ఉన్నారా...?

No comments: