Pages

Friday, 7 November 2014

వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

వాచస్పతి బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు గారి గురించి నేటి తరంలో తెలియనివారు లేరంటే అతిశయోక్తి లేదు. వారు కురిపించే ప్రవచానామృతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో సనాతన ధర్మాసక్తులు ఆస్వాదిస్తున్నారు. సమకాలీన ప్రవచనకర్తలలో అత్యుత్తములైన  సరస్వతీ పుత్రులు వారు. శ్రీనగర్ కాలనీ లోని సత్యసాయి నిగమాగమంలో ఈ నెల 6వ తేదీ నుంచి సుందరకాండపై వారు చెప్తున్న ప్రవచనం వినేందుకు వెళ్ళినప్పుడు ఆది దంపతులైన బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు దంపతులతో సంభాషించిన సందర్భంలో నాకు దక్కిన జీవితకాలపు మధుర జ్ఞాపకం.
                                                                         

Wednesday, 29 October 2014

వివిధ రంగాల ప్రముఖులతో...

వివిధ రంగాల ప్రముఖులతో భావజాల మార్పిడి...
సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆధ్వర్యంలో...
గత రాత్రి సరదాగా నిజాం క్లబ్ లో...
పాల్గొన్న ప్రముఖులతో నేను...
శ్రీ పద్మనాభయ్య, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, శ్రీ ద్వారకా తిరుమలరావు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్.,   శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ., శ్రీ ఎంవీ కృష్ణారావ్, నగర మాజీ పోలీస్ కమిషనర్., శ్రీ కే.సి. రెడ్డి, సిరియాలో ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు., శ్రీ పీవీ రమేష్, ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి., శ్రీ రాజకుమార్, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి., హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ  ఉపకులపతి రామకృష్ణ రామస్వామి., సిహెచ్ ఎస్ ఎస్ డైరెక్టర్ డా. కన్నెగంటి రమేష్ బాబు., తులసి సీడ్స్ డైరెక్టర్ కృష్ణ చైతన్య, న్యాయవాది విజయ్ కుమార్.
                                                                 

Wednesday, 22 October 2014

దీపావళి శుభాకాంక్షలు

                                                                       
ఆనందమయ జీవితానికి అసలైన నిర్వచనమిచ్చే పండుగే దీపావళి. దీపాల వెలుగులో లక్ష్మిని ఆరాధించి దారిద్ర్యాన్ని పారద్రోలి సంపదలు పొందే పండగ., చీకటిని చీల్చుకుంటూ వెలుగులతో నిండిపోయే పండుగ దీపావళి. మిత్రులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Monday, 13 October 2014

అన్నదాతకేదీ వెన్నుదన్ను!

వర్షాభావం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తే ., తాజాగా సంభవించిన హుద్ హుద్ తుపాన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంటలను అతలాకుతలం చేసింది. రుణమాఫీ అమలు ఆలస్యమై రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసుకున్న తరుణంలో పులి మీద పుట్రలా తాజా నష్టాలు రైతుల్ని కోలుకోనీయకుండా దెబ్బతీశాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రబీ సీజన్ ను రైతులకు ఎలా ఆశావహంగా మలచాల్సిన అవసరమున్నదో విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.  మీ కోసం ఈ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                       

Thursday, 2 October 2014

ప్రజలకు విజయోస్తు!

                                                                               

శుభశక్తులకు విజయం ., దుష్ట శక్తులకు పరాజయం...  విజయదశమి పర్వదినం లోని అంతరార్ధమిదే. సాటి మనుషులపై అకారణ ద్వేషం, అసూయ., అజ్ఞానం., అహంకారం., స్వార్ధబుద్ధి., కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే నైజం... ఇటువంటి అసుర లక్షణాలపై మంచి సాధించిన విజయమే ఈ పండగ మనకు నేర్పే గొప్ప నీతి. ఆ మంచిని స్వీకరిద్దాం... పొరుగు వారిని ప్రేమిద్దాం... మానవత్వాన్ని పంచుదాం. దసరా పర్వదినం సందర్భంగా తెలుగు వారికి విజయోస్తు!                             

Tuesday, 23 September 2014

జయహో భారత్

                                                                             
ఇది నిజంగా చరిత్రే. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా భారత్ నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయమిది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా., ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్, చైనా వంటి దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్ నమోదు చేయటం ఈ విజయం ప్రత్యేకత. ఇస్రో సాధించిన ఈ విజయంతో ఇతర రంగాలు స్ఫూర్తి పొందాలి. అరుణ గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రవేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో" శాస్రవేత్తలకు పేరు పేరునా అభినందనలు. భారతీయులకు శుభాకాంక్షలు. జయహో భారత్. 

Monday, 8 September 2014

సిసలైన ప్రజాకవి కాళోజి

                                                                         
                             

ప్రజల హృదయాలకు బాసటగా నిలిచి అన్యాయంపై నిగ్గదీయటం తన జన్మహక్కని చాటిన గొప్ప మానవతావాది, ప్రజాస్వామ్య వాది ప్రజాకవి కాళోజి జయంతి నేడు. కన్నెర్ర చేసినా కన్నీళ్ళు పెట్టుకున్నా గుండె తడితో దుర్మార్గాలు, దమననీతిపై గుండెలవిసేలా పోరాడిన సిసలైన ప్రజాకవి కాళోజి శతజయంతి ఉత్సవాలకు ముగింపు సందర్భంగా ఆ మానవతావాదిని స్మరించుకునే సందర్భమిది. వ్యక్తి స్వాతంత్ర్యం కోసం ఉక్కుపిడికిలి భిగించి "నవయుగంబున నాజీవృత్తుల నగ్నసత్యమింకెన్నాళ్ళు.,   పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందేదేన్నాళ్ళు.,      దమననీతితో దౌర్జన్యాలకు   దాగిలిమూతలు ఇంకెన్నాళ్ళు"  ....  అంటూ నిజాం పాలనలో పోలీసుల దౌర్జన్యంపై ప్రజాసమూహాలకు బాసటగా నిలిచి కలాన్ని ఆయుధంగా చేసి పోరాడిన ఉక్కుమనిషి మన కాళోజీ నారాయణరావు

అన్యాయాలకు వ్యతిరేకంగా గుండె చూపి పోరాడిన దీశాలి...
సిరాచుక్కలతో లక్షల మెదళ్లను కదిలించిన పోరాటశీలి....
జనం భాషతో జనపదాల్ని కదిలించిన కార్యశీలి...
స్వేచ్చాప్రియత్వం కోసం నిర్భీతితో పోరాడిన ప్రజాస్వామ్యవాదికిదే నా నివాళి!