మన నేలలు పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతున్నాయి. విచ్చలవిడి రసాయనాల వాడకంతో నేలలకు పట్టిన దుర్గతి ఇది. రసాయనాలతో నేలలోని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించడంతో వాటిని పంటలకు లభ్యమయ్యే రూపంలోకి తీసుకురాలేకపోతున్నాయి. ఫలితంగా నిస్సారమైన నేలల్లో పండించిన పంట ఇలా పోషకాలు లేకుండా ఉత్పత్తవుతోంది. ఇందుకు భూమిలో సేంద్రియ కర్భనాన్ని గణనీయంగా పెంచేందుకు సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాల ఆచరణతో పాటు పలు పరిష్కారాలను సూచించిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
No comments:
Post a Comment