తెలుగును అంతర్జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు ఈ నెల 28 నుంచి ౩౦వ తేది వరకు కాలిఫోర్నియా (అమెరికా)లోని మిల్పీటాస్ లో తెలుగు అంతర్జాల సదస్సును నిర్వహించనున్నారు. గురువారం హైదరాబాద్ లో సిలికానాంద్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఉమామహేశ్వర రావు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి భూమయ్య, ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, ఐ.టి. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఐ.టి. శాఖ, సిలికానాంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనికోడ్ ప్రతినిధులతో పాటు అమెరికా, జపాన్, మలేసియా,బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలకు చెందిన ప్రతినిధులు, పూణే, కోల్ కతా, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు నగరాల నుంచి 200 మంది సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. ఇంటర్ నెట్ తెలుగులో తీసుకురావాల్సిన మార్పులపై ఈ ప్రతినిధులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఒక కార్యాచరణను రూపొందించనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.మొత్తంమీద అక్టోబర్ 17 న జరిగే యూనికోడ్ సమావేశంలో తెలుగు యూనికోడ్ కు తుది రూపం ఇవ్వనుండటం విశేషం.
1 comment:
This is all SiliconAndhra stunt to invite people to US from India and spending so much public tax money for nothing. Telugu vaaLLu gorrelu. ee samaavESaallO origi caccEdEmee lEdu, Traavel EjamTlu baagupaDaDam tappa.
Post a Comment