Wednesday, 17 October 2018
Thursday, 11 October 2018
జేడీ లక్మీనారాయణ గారితో...
మైనింగ్ మాఫియాను గడ గడలాడించిన అప్పటి సీబీఐ దిగ్గజం జెడి లక్మీనారాయణ గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో రైతులతో సమావేశమవుతున్నారు. రైతు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. దీనిపై నా అనుభవాలను తెలుసుకునేందుకు వారు నన్ను ఆహ్వానించారు. వ్యవసాయరంగంపై నేను రాసిన వ్యాసాల్లోని మంచి సూచనల్ని పలు సమావేశాల్లో రైతులకు చదివి వినిపించాను అంటూ గతేడాది రాసిన కొన్ని వ్యాసాలను ఉటంకిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
Monday, 8 October 2018
ఉపాధిగా కోళ్ల పరిశ్రమ
వ్యవసాయం
అనుబంధ పరిశ్రమగా కోళ్ల పెంపకం
చక్కని ఉపాధి మార్గం. కొన్ని
దశాబ్దాలుగా రైతులు పెరటి
కోళ్లు పెంచుతూనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో అది
కాస్త నెమ్మదించినా సాగు
ఆదాయం క్షీణించినప్పుడు
పాడి-కోళ్లు,జీవాల
నుంచి వచ్చే ఆదాయం స్ధిరంగా
ఉంటూ రైతులకు చేయూతగా ఉండేది.
వాణిజ్యసరళిలో కోళ్ల
పెంపకానికి మంచి అవకాశాలున్న
తరుణంలో నిరుద్యోగులు,
రైతులు వాటిని ఏర్పాటు
చేసుకోవడానికి అవసరమైన ఆదాయ,
వ్యయాలను తెలుసుకోవడం
ఎంతో ముఖ్యం. ఆ
వివరాల గురించి రాసిన నా
వ్యాసాన్ని అక్టోబరు నెల
అన్నదాత మాసపత్రికలో చూడవచ్చు.
Wednesday, 12 September 2018
Saturday, 8 September 2018
Saturday, 18 August 2018
గొర్రెల పెంపకం ప్రాజెక్టు రిపోర్టు
సేద్యానికి
అనువుగా లేని ప్రాంతాలలో
గొర్రెల పెంపకాన్ని వాణిజ్య
సరళిలో చేపట్టడం లాభసాటి.
పంటల సాగుకు అనుబంధంగా
చేపట్టే ఇలాంటి వ్యాపకాల
వల్ల రైతులు స్థిరమైన ఆదాయాలను
అందుకోగలుగుతారు. ఒక
వంద గొర్రెలతో పెంపకం చేపడితే
వచ్చే ఆదాయ వ్యయాల ప్రాజెక్టు
రిపోర్టుతో పాటు ఇతర వివరాలతో
కూడిన వ్యాసాన్ని ఆగస్టు నెల
"అన్నదాత"
మాసపత్రిక ప్రచురించింది.
Monday, 13 August 2018
నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి
నేలల్లో రకాలున్నా అందరూ పండించేది అదే నేలపై. కొందరు రైతులు తెలివిగా సేద్యంలో లాభాలు రాబట్టుకుంటుంటే., అధిక శాతం మంది కడగండ్లను ఎదుర్కొంటున్నారు. సేద్యంలో నైపుణ్యాలను పెంచుకుంటూ సేద్యాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంలా చేయగలుగుతున్న వాళ్లను విజయాలు వరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల చేయూత లోపం, మార్కెట్ శక్తుల ప్రాబల్యం ఇవన్నీ రైతుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి సాధ్యపడుతుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా చేపట్టి నైపుణ్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుతాయంటున్న నా వ్యాపాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)













