Pages

Saturday, 28 October 2017

డా.రఘోత్తమరెడ్డి వ్యవసాయ పురస్కారం

                                                                     




డాక్టర్‌ జెన్నారెడ్డి రఘోత్తమరెడ్డి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఉపకులపతుల్లో వారొకరు. మల్యాల (వరంగల్‌) లోని వందలాది ఎకరాలను వ్యవసాయ పరిశోధనలకు రాసిచ్చిన రైతు బాంధవుడు. అలాంటి మహానుభావుని స్మారకార్ధం వ్యవసాయ జర్నలిజంలో విశేష కృషి చేసిన వారికిచ్చే అవార్డును నాకు బహుకరించడం ఎంతో సంతోషం కలిగించింది.అన్నదాత సంపాదకులు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు(2012లో) గారి తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిని నేను. నా పాత్రికేయ జీవన పురోగతిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు.